గుజరాత్ తీరంలో రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. 14 మంది పాకిస్థానీల అరెస్ట్

ఆదివారం నాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్త ఆపరేషన్‌లో, గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తానీ జాతీయులను అరెస్టు చేసింది.

By అంజి  Published on  28 April 2024 10:36 AM GMT
Pakistani nationals, arrest, Gujarat coast, drugs

గుజరాత్ తీరంలో రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. 14 మంది పాకిస్థానీల అరెస్ట్ 

ఆదివారం నాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్త ఆపరేషన్‌లో, గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తానీ జాతీయులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 602 కోట్ల రూపాయల విలువైన 86 కిలోల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సమయంలో అరెస్టు నుండి తప్పించుకునే ప్రయత్నంలో పాకిస్తాన్ జాతీయులు ఏటీఎస్‌ అధికారులపైకి తమ పడవను నడిపేందుకు ప్రయత్నించారు. దీంతో అధికారులు ప్రతీకారంగా కాల్పులు జరిపారు. అనంతరం నిందితులను పట్టుకున్నారు.

భద్రతా సంస్థలు గత రెండు రోజులుగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దగ్గర, భారత ప్రాదేశిక జలాల పరిధిలో సోదాలు నిర్వహిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్‌లలో 'మియావ్ మియావ్'గా ప్రసిద్ధి చెందిన నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్‌ను తయారు చేస్తున్న మూడు ల్యాబ్‌లను ఎన్‌సీబీ గుర్తించింది. ఈ విషయానికి సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. సుమారు రూ.300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది.

గుజరాత్, రాజస్థాన్‌లలో డ్రగ్ మెఫెడ్రోన్‌ను ఉత్పత్తి చేస్తున్న ల్యాబ్‌లకు సంబంధించి గుజరాత్ పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) రహస్య మూలం నుండి సమాచారం అందుకున్న తర్వాత ల్యాబ్‌లను గుర్తించారు.

Next Story